హోటల్ వద్ద రూ.10 లక్షల నగదు చోరీ.. ప్రయాణికుడి ఫిర్యాదు
హోటల్ వద్ద రూ.10 లక్షల నగదు చోరీ.. ప్రయాణికుడి ఫిర్యాదు
నల్లగొండ జిల్లా, జూలై 19: నార్కట్పల్లి మండలం గోపాలయాపల్లి సమీపంలోని పూజిత హోటల్ వద్ద చోరీ ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అల్పాహారం కోసం హోటల్ వద్ద ఆగగా, ప్రయాణికుడు ఆరే రవీందర్ రెడ్డి వద్ద ఉన్న నగదు బ్యాగ్ను గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు సమాచారం.
బ్యాగులో సుమారు రూ.10 లక్షల నగదు ఉన్నట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న నార్కట్పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
హోటల్ వద్ద గత కొద్దిరోజులుగా సీసీ కెరాలు పనిచేయడం లేదని హోటల్ యజమాని పోలీసులకు తెలిపాడు. ఇదే హోటల్ వద్ద గతంలో కూడా పలుమార్లు ప్రయాణికుల నుంచి నగదు చోరీ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.