సిగరెట్ ధరలకు భారీగా పెంపు.. జేబుకు చిల్లు
జాతీయం
జాతీయం
సిగరెట్ ప్రియులకు మరోసారి ధరల షాక్ తగిలింది. ప్రముఖ పొగాకు సంస్థ ఐటీసీ పలు బ్రాండ్ల సిగరెట్ల ధరలను పెంచింది. జీఎస్టీ 40 శాతానికి చేరడం, కొత్త ఎక్సైజ్ సుంకాల అమలు నేపథ్యంలో ధరలు పెరిగినట్లు సమాచారం.
ధరల పెంపుతో క్లాసిక్ కనెక్ట్ ప్యాక్ ధర రూ.390 నుంచి రూ.428కు చేరింది. అలాగే గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ సిగరెట్ ధర రూ.79 నుంచి రూ.89కు పెరిగింది. దీంతో సిగరెట్ వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
ఇప్పటికే పొగతాగడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, పెరిగిన ధరలు వినియోగదారుల నెలవారీ ఖర్చులపై కూడా ప్రభావం చూపనున్నాయి. ఆరోగ్య నష్టంతో పాటు సిగరెట్ల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడంతో ఆర్థికంగానూ నష్టం తప్పదని పలువురు పేర్కొంటున్నారు.