ఆరుగొలనుపేటలో ఘనంగా వినాయక నిమజ్జనం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని గౌడ్ బజారు, బొల్లికొండ వారి వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. యువత, మహిళలు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.