ఇడుపులపాయలో వైయస్ఆర్కు ఘన నివాళి
కుటుంబ సభ్యులతో కలిసి వైయస్ఆర్ ఘాట్ వద్ద వైయస్ జగన్ పుష్పాంజలి
ఇడుపులపాయ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించారు. వైయస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్ వద్దకు చేరుకుని వైయస్ఆర్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.
వైయస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఉదయం నుంచే ఘాట్ వద్దకు వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన నేతకు నివాళులర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇడుపులపాయకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఘాట్ వద్దకు వచ్చిన వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను వైయస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వారితో కొద్దిసేపు మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైయస్ఆర్ను స్మరించుకుంటూ పార్టీ శ్రేణులు ఘనంగా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు.