BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

ఇకపై ఏపీలో రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్.. రైతులకు భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 09:33 PM
33 వీక్షణలు

అమరావతి, జూలై 4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాత, తండ్రి లేదా తల్లి మరణించిన తర్వాత వ్యవసాయ భూములను వారసుల పేర్లకు మార్చుకునే విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెడుతూ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

కొత్త నిబంధనల ప్రకారం రూ.10 లక్షల లోపు విలువైన వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు కేవలం రూ.100 స్టాంపు డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. భూమి విలువ రూ.10 లక్షలకు మించి ఉంటే రూ.1,000 చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.

అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు ఆటో మ్యుటేషన్ విధానాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో భూమి రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే సంబంధిత వివరాలు స్వయంచాలకంగా రెవెన్యూ రికార్డుల్లో నమోదవుతాయి. దీంతో రైతులు, వారసులు మ్యుటేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోనుంది.

ఈ నిర్ణయంతో వారసత్వ భూముల బదిలీ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు రైతులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భూముల వారసత్వ హక్కుల నమోదు మరింత పారదర్శకంగా, సులభంగా మారనుంది.