ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు రాజ్నాథ్ సింగ్కు ఆహ్వానం
డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో సదస్సు.. డిఫెన్స్ ఎక్స్పో ప్రారంభించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ | Ntoday News
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరు కావాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆహ్వానించారు. ఢిల్లీలో పలువురు ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కలిశారు.
డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. సమ్మిట్లో భాగంగా నిర్వహించనున్న డిఫెన్స్ ఎక్స్పో-2026ను ప్రారంభించాలని రాజ్నాథ్ సింగ్ను కోరారు.
డిఫెన్స్ ఎక్స్పోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సును నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. దీనితో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ భేటీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్తో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.