BREAKING
బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

జలసిరి పథకంతో భూగర్భ జలాల పెంపు : స్టేట్ ఎస్ బి ఎం కోఆర్డినేటర్ శ్రీధర్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
25 Jul, 2026 - 08:15 PM
5 వీక్షణలు

జలసిరి పథకంతో భూగర్భ జలాల పెంపు : స్టేట్ ఎస్ బి ఎం కోఆర్డినేటర్ శ్రీధర్   

జలసిరి పథకంతో భూగర్భ జలాల పెంపొందించొచ్చు అని తెలంగాణ స్టేట్ ఎస్ బి ఎం కోఆర్డినేటర్ శ్రీధర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలసిరి  కార్యక్రమంలో భాగంగా శనివారం పిట్టంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ అందే అండాలు అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ ఎస్బీఎం  కోఆర్డినేటర్ శ్రీధర్ హాజరయ్యారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విబిజిరాంజీ పథకంలో భాగంగా ప్రతి చిన్నకారు రైతు తమ పొలాల్లో ఫారం పాండ్లు, నీటి కందకాలు, బోర్ వెల్ రీచార్జ్ నిర్మాణాలను ఉచితంగా చేపట్టవచ్చని తెలిపారు. ఈ నిర్మాణాలకు అయ్యే సంపూర్ణ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. వీటి వల్ల భూగర్భ జలాలు పెరగడమే కాకుండా, కరువు పరిస్థితుల్లో కూలీలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని రైతులకు, సంఘబంధం సభ్యులకు అవగాహన కల్పించారు.

​ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలి అని సూచించారు. వర్షపు నీరు, ఇంటి మురుగు నీరు రోడ్లపైకి రాకుండా ఇంకుడు గుంతల ద్వారా ఇంకింపజేయడం వల్ల గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని, వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ విభాగం ఈసీ వినోద్ కుమార్, పంచాయతీ కార్యదర్శి గోలి మల్లేష్, వార్డు సభ్యులు జక్కల సీనయ్య, గ్రామ పెద్దలు అందే రాములు, కడారి వెంకటయ్య, అందే భగవంత, ఫీల్డ్ అసిస్టెంట్ బాతరాజు శోభ, వి.బి.కే. సింగిరెడ్డి శోభారాణి, మేడి శైలజ తదితరులు పాల్గొన్నారు.