జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. హెచ్ఐవీ బాధితురాలిని అడవిలో వదిలేసిన కుటుంబ సభ్యులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. హెచ్ఐవీ బాధితురాలిని అడవిలో వదిలేసిన కుటుంబ సభ్యులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మానవత్వాన్ని మరిచిపోయేలా చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగుచూసింది. హెచ్ఐవీతో బాధపడుతున్న ఓ మహిళను ఆమె కుటుంబ సభ్యులు అడవిలో వదిలేసి వెళ్లిపోయిన ఘటన కలకలం రేపింది.
కరీంనగర్ ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్తామని చెప్పిన కుటుంబ సభ్యులు మార్గమధ్యంలో మహిళను అడవిలో వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒంటరిగా ఉన్న మహిళను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనానికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది మహిళను మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై స్థానికులు 112 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన సరిగా లేదని ఆరోపిస్తున్నారు.
హెచ్ఐవీ బాధితురాలిని ఆదుకోవాల్సిన కుటుంబ సభ్యులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.