BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

కేసులో సాయం చేస్తానంటూ రూ.30 వేల లంచం డిమాండ్‌.....

తెలంగాణ
/ కామారెడ్డి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 03:54 PM
29 వీక్షణలు

కేసులో సాయం చేస్తానంటూ రూ.30 వేల లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన రాజంపేట ఎస్ఐ

ఇంట్లోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు

కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్‌ స్టేషన్‌ ఎస్ఐ దువ్వల ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కేసులో సహాయం చేస్తానంటూ బాధితుడి నుంచి రూ.30 వేల నగదు డిమాండ్ చేసి, తన నివాసంలోనే లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రాజంపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన ఓ కేసులో ఫిర్యాదుదారుడి కుమారుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించడంతో పాటు, తదుపరి చార్జిషీట్‌ దాఖలు సమయంలో అనుకూలంగా వ్యవహరిస్తానని చెప్పిన ఎస్ఐ ఆంజనేయులు అందుకు ప్రతిఫలంగా రూ.30 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా గురువారం ఎస్ఐ తన ఇంట్లో బాధితుడి నుంచి రూ.30 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం ఎస్ఐ దువ్వల ఆంజనేయులును అరెస్ట్ చేసి హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు.

ప్రభుత్వ శాఖల్లో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు. లంచం అడిగే అధికారులపై 1064 టోల్‌ఫ్రీ నంబర్‌ లేదా 9440446106 వాట్సాప్‌ నంబర్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.