కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం
కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం NTODAY NEWS చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు శివనేనిగూడెంలో వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య కన్నుల పండుగగా సాగింది. స్వామి వారి కళ్యాణ వేడుకలో చిట్యాల మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీతా రమేష్ దంపతులు పాల్గొని, స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు
వార్డు కౌన్సిలర్ నాగిళ్ల సుధాకర్ (కావేరి), వివిధ వార్డ్ కౌన్సిలర్లు,
రుద్రవరం లింగస్వామి
మైల నరసింహ
స్థానిక నేతలు మరియు గ్రామంలోని భక్తులు
పెద్ద ఎత్తున తరలివచ్చిన శివ భక్తులతో శివనేనిగూడెం ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగింది.