కొండపర్వలో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు
కొండపర్వలో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు
విస్సన్నపేట: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ సామాజిక కార్యకర్త, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి బోట్ల శివ సత్యనారాయణ టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం శివ మాట్లాడుతూ.. 1953లో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రకాశం పంతులు ప్రజలకు విశేష సేవలు అందించారని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన వీరోచితంగా పోరాడి దేశానికి స్వరాజ్యం సాధించేందుకు కృషి చేసిన మహానీయుడని కొనియాడారు.
ప్రకాశం పంతులు చూపిన మార్గంలో నేటి యువత, విద్యార్థులు నడవాలని, ఆయన ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించాలని శివ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కిషోర్, దేవేంద్ర, త్రిమూర్తి, ప్రశాంత్, సత్యనారాయణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.