కోకిలంపాడులో వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో తిరువూరు మండల బూత్ కమిటీ కన్వీనర్ యరనుక రవి, మండల నాయకులు చెన్ను కృష్ణ ప్రసాద్, గ్రామ సర్పంచ్ గంగాధారి కోటేశ్వరరావు, గ్రామ అధ్యక్షుడు అంకిరెడ్డి మురళీరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నర్సిరెడ్డితో పాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.