BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

కూతురిని బలవంతంగా తీసుకెళ్లిన తండ్రిపై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 08:25 PM
35 వీక్షణలు

కూతురిని బలవంతంగా తీసుకెళ్లిన తండ్రిపై కేసు నమోదు

తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శెట్టిపల్లె గుంట వీధిలో నాలుగున్నరేళ్ల మైనర్ బాలికను తండ్రి బలవంతంగా తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ నెల 17న జరిగిన ఈ ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న వర్షకు నరసరావుపేటకు చెందిన వెంకటకృష్ణతో పరిచయం ఏర్పడి ప్రేమ వివాహంగా మారింది. వీరికి తన్విశ్రీ అనే నాలుగున్నరేళ్ల కుమార్తె ఉంది. అయితే కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటకృష్ణ తరచూ గొడవలు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.

ప్రస్తుతం బాలిక తల్లి వద్దే ఉంటోంది. 15 రోజుల క్రితం ఉద్యోగ నిమిత్తం హైదరాబాదుకు వెళ్లిన తండ్రి.. శెట్టిపల్లె గుంట వీధిలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను బలవంతంగా తీసుకెళ్లినట్లు తల్లి ఆరోపించింది.

విషయం తెలుసుకున్న తల్లి తండ్రిని ఫోన్ ద్వారా సంప్రదించి తన కుమార్తెను అప్పగించాలని కోరగా స్పందించకపోవడంతో అలిపిరి పోలీసులను ఆశ్రయించింది. తల్లి ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 288/2026 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలిపిరి ఎస్సై రామాంజనేయులు కేసును విచారిస్తున్నారు.