BREAKING
ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
www.ntodaynews.com

కృష్ణమ్మ వెలవెల.. ప్రాణహితకు జలకళ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 12:45 PM
14 వీక్షణలు

వరదలు లేక ఆయకట్టు రైతుల్లో ఆందోళన.. గతేడాది మేలోనే జూరాలకు వరద, ఈసారి ఇంకా జాడలేదు

గద్వాల/కాగజ్‌నగర్: ఈ ఏడాది ఎగువ ప్రాంతాల్లో తగినంత వర్షపాతం లేకపోవడంతో కృష్ణానది వెలవెలబోతోంది. జూరాల ప్రాజెక్టు దిగువన ఇసుక దిబ్బలు, రాళ్లు బయటపడటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతుండగా, కృష్ణానదికి మాత్రం ఇప్పటివరకు గణనీయమైన వరద రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

గతేడాది మే 27 నుంచే జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం ప్రారంభమైంది. అప్పటివరకు 3.2 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ మే 29 నాటికి 7.78 టీఎంసీలకు చేరింది. అదే రోజు రాత్రి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో నమోదవడంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు.

అలాగే 2025 మే 29 నుంచే శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం ప్రారంభమైంది. అప్పటివరకు 39 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ జూన్ 3 నాటికి 70 టీఎంసీలకు పెరిగింది. దీంతో జూన్ మొదటి వారంలోనే అధికారులు వివిధ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. జూరాల పరిధిలోని భీమా లిఫ్ట్-1, లిఫ్ట్-2, కోయిల్‌సాగర్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్, ఆర్డీఎస్ ప్యారలల్ కెనాల్స్‌కు నీటిని విడుదల చేశారు.

అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పటికే ఏరువాక ప్రారంభమైనప్పటికీ కృష్ణానదికి వరదలు రాకపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.