www.ntodaynews.com
రాజస్థాన్, గుజరాత్లో నేడు మోదీ పర్యటన
జాతీయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రూ.1.06 లక్షల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. జోధ్పూర్లో కొత్త విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించి, సవరించిన ఉడాన్ పథకాన్ని ప్రారంభిస్తారు. బాలోత్రా జిల్లాలోని పచ్పద్రాలో దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ సమీకృత రిఫైనరీ-పెట్రోకెమికల్ సముదాయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే జైపూర్ మెట్రో రెండో దశ, రైల్వే ప్రాజెక్టులు, సౌర విద్యుత్ కేంద్రాలు, రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అహ్మదాబాద్ సమీపంలోని సనంద్లో సెమీకండక్టర్ అసెంబ్లీ, పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.