www.ntodaynews.com
కురబలకోటలో కారు-లారీ ఢీ.. ముగ్గురికి గాయాలు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. మదనపల్లె నుంచి టమోటా లోడుతో కదిరి వైపు వెళ్తున్న లారీని, దొమ్మన్నభావి నుంచి మదనపల్లె వైపు వస్తున్న కారు ఎగువ బోయపల్లె రోడ్డు క్రాస్ వద్ద ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడగా, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.