BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

లింగపాలెం జడ్పీ హైస్కూల్‌లో పోలీసుల అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 05:14 PM
27 వీక్షణలు

లింగపాలెం: విద్యార్థులకు అత్యవసర టోల్‌ఫ్రీ నంబర్లు, రహదారి భద్రతపై ధర్మాజీగూడెం పోలీసులు అవగాహన కల్పించారు. లింగపాలెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న సిబ్బందితో కలిసి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు, చింతలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చిన టోల్‌ఫ్రీ నంబర్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచించారు. 112 ద్వారా అత్యవసర పోలీసు, అగ్నిమాపక, వైద్య సహాయం పొందవచ్చని తెలిపారు. 181 మహిళల రక్షణ, సహాయం కోసం, 1098 బాలల సంరక్షణ కోసం, 1930 సైబర్ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు వినియోగించుకోవాలని వివరించారు.

రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విద్యార్థులకు తెలిపారు. తాము తెలుసుకున్న విషయాలను ఇంట్లోని పెద్దలు, చుట్టుపక్కల వారికి తెలియజేసి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు.

కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.