BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

మైలవరం ఏసీపీ రామచంద్రరావుకు ఉత్తమ సేవా పథకం అవార్డు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 07:05 AM
36 వీక్షణలు

మైలవరం ఏసీపీ రామచంద్రరావుకు ఉత్తమ సేవా పథకం అవార్డు

మైలవరం: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో మైలవరం డివిజన్ ఏసీపీ పి. రామచంద్రరావు ఉత్తమ సేవా పథకం అవార్డును అందుకున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, పోలీస్ శాఖకు విశిష్ట సేవలు అందించినందుకు ఈ పురస్కారం లభించింది.

రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఏసీపీ రామచంద్రరావు ఈ అవార్డును స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందజేశారు.

విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, సమర్థవంతమైన నాయకత్వంతో మైలవరం డివిజన్‌లో పోలీస్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఏసీపీ చేస్తున్న కృషి అభినందనీయమని పోలీస్ సిబ్బంది పేర్కొన్నారు.

ఈ అవార్డు మైలవరం డివిజన్ పోలీస్ సిబ్బంది మొత్తానికి గర్వకారణమని, ఏసీపీ రామచంద్రరావు సేవలు సిబ్బందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ సందర్భంగా మైలవరం డివిజన్ పోలీసుల తరఫున ఏసీపీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకుని పోలీస్ శాఖకు, మైలవరం డివిజన్‌కు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.