మైలవరం ఏసీపీ రామచంద్రరావుకు ఉత్తమ సేవా పథకం అవార్డు
మైలవరం ఏసీపీ రామచంద్రరావుకు ఉత్తమ సేవా పథకం అవార్డు
మైలవరం: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో మైలవరం డివిజన్ ఏసీపీ పి. రామచంద్రరావు ఉత్తమ సేవా పథకం అవార్డును అందుకున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, పోలీస్ శాఖకు విశిష్ట సేవలు అందించినందుకు ఈ పురస్కారం లభించింది.
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఏసీపీ రామచంద్రరావు ఈ అవార్డును స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందజేశారు.
విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, సమర్థవంతమైన నాయకత్వంతో మైలవరం డివిజన్లో పోలీస్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఏసీపీ చేస్తున్న కృషి అభినందనీయమని పోలీస్ సిబ్బంది పేర్కొన్నారు.
ఈ అవార్డు మైలవరం డివిజన్ పోలీస్ సిబ్బంది మొత్తానికి గర్వకారణమని, ఏసీపీ రామచంద్రరావు సేవలు సిబ్బందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ సందర్భంగా మైలవరం డివిజన్ పోలీసుల తరఫున ఏసీపీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకుని పోలీస్ శాఖకు, మైలవరం డివిజన్కు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.