మదనపల్లె: ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు
మదనపల్లె: అన్నమయ్య జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు
మదనపల్లె, ఆగస్టు 23:
ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (పరిపాలన) వెంకటాద్రి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో బ్రిటీష్ తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని కొనియాడారు.
ప్రకాశం పంతులు ధైర్యం, నిస్వార్థ ప్రజాసేవ, దేశభక్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) యు. రంగనాథ్ బాబు, ఆర్ఎస్ఐలు శ్రీనివాస్, మగ్బుల్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.