BREAKING
బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

మధిరలో ఈ విద్యా సంవత్సరంలోనే జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల తరగతులు ప్రారంభం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jul, 2026 - 09:32 PM
12 వీక్షణలు

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను జేఎన్‌టీయూ అధికార బృందం శనివారం సందర్శించి, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక వసతులను పరిశీలించింది.

ఈ సందర్భంగా ఎస్‌బీటీఈటీ కార్యదర్శి పుల్లయ్య, జేఎన్‌టీయూ మందని ప్రిన్సిపాల్ డా. విష్ణువర్ధన్, జేఎన్‌టీయూ సభ్యులు, మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె. సాంబయ్య, జనరల్ హెడ్ వినోద్ కుమార్ కళాశాలలోని తరగతి గదులు, ప్రయోగశాలలు, ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.

అనంతరం అధికారులు మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరం నుంచే మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో బీటెక్ తొలి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు పాలిటెక్నిక్ కళాశాలలోనే తాత్కాలికంగా ఇంజనీరింగ్ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.

ఈ సందర్భంగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు సూరంశెట్టి కిషోర్, షేక్ జహంగీర్ జేఎన్‌టీయూ అధికారులను కలిసి, మధిరలో ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక వసతుల కల్పనకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.