మెకానిక్ కార్మికుల యూనియన్ అధ్యక్షుడిగా యాదగిరి గౌడ్
మెకానిక్ కార్మికుల యూనియన్ అధ్యక్షుడిగా యాదగిరి గౌడ్
నల్గొండ జిల్లా చిట్యాల మెకానిక్ కార్మికుల యూనియన్ నూతన అధ్యక్షుడిగా మారగోని యాదగిరి గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు, స్థానికులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. యాదగిరి గౌడ్ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు, స్థానిక ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు మారగోని యాదగిరి గౌడ్ మాట్లాడుతూ కార్మికుల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తానని, వారి ఐక్యత, సంక్షేమమే లక్ష్యంగా యూనియన్ను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ప్రతినిధులు, మెకానిక్ కార్మికులు, స్థానికులు పాల్గొన్నారు.