BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​మంచిర్యాల జిల్లాలో పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ: కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Jun, 2026 - 09:24 PM
126 వీక్షణలు

మంచిర్యాల, జూన్ 23: జిల్లాలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వి.రాములు, డీఆర్వో మొతిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఆర్డీవో శ్రీనివాస్ రావులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కీలక ప్రక్రియలో రాజకీయ పార్టీలు చురుగ్గా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

​ఈ సవరణ కార్యక్రమం కింద బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ప్రతి ఓటరుకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాన్ని స్వయంగా అందిస్తారని, ఓటర్లు నింపిన ఆ ఫారాలను తిరిగి సేకరించి వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేస్తారని కలెక్టర్ వివరించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లకుండా రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు క్షేత్రస్థాయిలో బీఎల్ఓలకు సహకరించాలని సూచించారు. తహసిల్దార్లు, సూపర్‌వైజర్లు, జిల్లా యంత్రాంగం నిరంతరం ఈ సవరణ ప్రక్రియను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బాధ్యతగా తమ బూత్ స్థాయి ఏజెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు, विभिन्न స్థానంలో మార్చిన 'వివిధ' గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు