BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​మంచిర్యాల:ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై బీఆర్ఎస్ శ్రేణులకు అవగాహన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Jun, 2026 - 09:21 PM
178 వీక్షణలు

బీఎల్‌ఏ లకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్

​మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో గల ఎస్.కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLA) ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)’ అంశంపై సోమవారం ఒక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ శ్రేణులు, బీఎల్‌ఏ లకు దిశానిర్దేశం చేశారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఏజెంట్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా ప్రోత్సహించాలని, అలాగే జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకునే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు