మంచిర్యాల:ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై బీఆర్ఎస్ శ్రేణులకు అవగాహన
బీఎల్ఏ లకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో గల ఎస్.కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLA) ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)’ అంశంపై సోమవారం ఒక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ శ్రేణులు, బీఎల్ఏ లకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఏజెంట్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా ప్రోత్సహించాలని, అలాగే జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకునే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు