BREAKING
గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం
www.ntodaynews.com

​ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యే లక్ష్యం: కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Jun, 2026 - 09:25 PM
9 వీక్షణలు

నస్పూర్, జూన్ 23: మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సమీకృత కార్యాలయాల భవనంలో విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన గుణాత్మక విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు ప్రతిరోజూ ఒక పాఠశాలను తప్పనిసరిగా సందర్శించి విద్యార్థుల చదవడం, రాయడం వంటి అభ్యసన ప్రమాణాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే, ప్రధానోపాధ్యాయులు పాఠశాల సముదాయ సమావేశాల అంశాలపై నివేదికలు రూపొందించి, విద్యార్థుల హాజరు, విద్యా బోధన ఫలితాలపై ఉపాధ్యాయుల వారీగా క్షుణ్ణంగా సమీక్షించాలని స్పష్టం చేశారు.

​ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల బదిలీ ధ్రువపత్రాల (TC) సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయులకు సాధ్యమైనంత వరకు కేవలం విద్యా బోధన సంబంధిత విధులనే కేటాయించాలని, బోధనేతర సిబ్బంది విధులు, మధ్యాహ్న భోజన అమలు, మరియు యు-డైస్ (U-DISE) వివరాల నమోదును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ నిర్మాణాత్మక చర్యల ద్వారా విద్యా నాణ్యత ప్రమాణాలు పెంపొంది, వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు