BREAKING
మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం
Date of Publish : 07 September 2026, 06:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మంగళగిరి : అవకాశాలను అందిపుచ్చుకోవాలి.. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Sep, 2026 - 06:43 PM
10 వీక్షణలు

ఎన్టీఆర్ భవన్‌లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ లీడర్‌షిప్ కాంక్లేవ్

మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ తరఫున తొలిసారిగా లీడర్‌షిప్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిణామాలను అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించగలిగితే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. సాగునీరు, తాగునీటి అవసరాలను తీర్చేలా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర సహకారాన్ని అందిపుచ్చుకోవాలి

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని చంద్రబాబు తెలిపారు. కేంద్రం నుంచి లభిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు.

వర్తమాన అంశాలపై అవగాహన అవసరం

రాజకీయ నాయకులు కేవలం పార్టీ వ్యవహారాలకే పరిమితం కాకుండా వర్తమాన అంశాలను అర్థం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రజల సమస్యలు, సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులు, రాజకీయ పరిణామాలపై నిరంతరం అవగాహన పెంచుకోవాలని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వం వ్యవహరించినప్పుడే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలమని పేర్కొన్నారు.