www.ntodaynews.com
మునుకుళ్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కెనరా విద్యా జ్యోతి పథకం చెక్కుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
మునుకుళ్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కెనరా విద్యా జ్యోతి పథకం చెక్కుల పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో కెనరా విద్యా జ్యోతి పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా ఒక్కో విద్యార్థికి రూ.5 వేల విలువైన చెక్కులను కెనరా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ వసంత్, సబార్డినేటర్ కె. సత్యం పంపిణీ చేశారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.