www.ntodaynews.com
ముసునూరు మండలంలో బోర్ మోటార్ వైర్ల దొంగతనం కేసు – ఇద్దరు నిందితులు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో రైతుల బోర్ మోటార్ వైర్ల దొంగతనాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్ఐ ఎం. చిరంజీవి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు.
రాత్రి గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనాలపై వైర్ల మూటలతో వెళ్లుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో వారు గంజాయికి బానిసలై, డబ్బు అవసరాల కోసం దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. నిందితుల వద్ద నుండి దొంగిలించిన మోటార్ వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు.