నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలి : అమరోజు వెంకన్న
నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలి : అమరోజు వెంకన్న
నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని చిట్యాల నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు అమ్మరోజు వెంకన్న అన్నారు. పట్టణంలోని బి.ఎన్.రెడ్డి ఫంక్షన్ హాల్లోనే నాయి బ్రాహ్మణ సేవా సంఘం శనివారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలకు వర్తించే అన్ని సంక్షేమ సౌకర్యాలను నాయి బ్రాహ్మణులకు కూడా వర్తింపజేయాలి అని క్షవరవృత్తిదారులకు 50 సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన పేద నాయి బ్రాహ్మణులందరికీ ఇందిరమ్మ లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలి అని . నాయి బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి అమరోజు శ్రీరాములు, వావిళ్ళ కృష్ణయ్య, అమరోజు కృష్ణ, జంపాల వెంకన్న, చికిలం మెట్ల పాపయ్య, చెన్నారపు నరసింహ, అక్కెనపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు...