www.ntodaynews.com
నేడు అనంతపురంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అనంతపురంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరవుతుండటంతో విద్యార్థులు, అధ్యాపకుల్లో ఉత్సాహం నెలకొంది.