BREAKING
నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం
www.ntodaynews.com

నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. పింఛన్ పంపిణీ నుంచి భారీ పెట్టుబడుల దాకా కీలక కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:02 PM
15 వీక్షణలు

అమరావతి, జులై 1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం నెల్లూరు జిల్లా చిల్లకూరులో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేయనున్నారు. అనంతరం పున్నపువారిపాలెంలో ఓ లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించనున్నారు. అలాగే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

మధ్యాహ్నం తిరుపతికి చేరుకోనున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు, అక్కడ హీరో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 4 వేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.