నీట్ పేపర్ లీక్పై మంచిర్యాలలో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ - విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం
నీట్ పేపర్ లీక్పై మంచిర్యాలలో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ - విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం
మంచిర్యాల: ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నీట్ పేపర్ లీక్ ఘటన మరియు ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని తీవ్రంగా నిరసిస్తూ మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ గాంధీ పార్క్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా (ఐబీ) వరకు కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల ఉద్యమానికి పూర్తి సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు.. విద్యా వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని, విద్యార్థుల హక్కులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. అలాగే, దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తమ పోరాటం నిరంతరం కొనసాగిస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు