www.ntodaynews.com
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరిక
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరిక
మంచిర్యాల, ఏప్రిల్ 08: జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్లో డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, ఏడీ సురేఖ మరియు ఇతర అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నకిలీ పత్తి విత్తనాల వల్ల రైతులకు కలిగే నష్టాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసే దళారులు, విక్రయదారులపై నిఘా ఉంచి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నదాతలను మోసం చేసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.