BREAKING
ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
Date of Publish : 02 September 2026, 10:53 pm
Posted by : BOYA SWAMY

నకిరేకల్ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
02 Sep, 2026 - 10:53 PM
7 వీక్షణలు

ఉరుమడ్ల గ్రామ కాంగ్రెస్ శ్రేణులకు పోలగోని నర్సింహ గౌడ్ పిలుపు

చిట్యాల | Ntoday News

ఈ నెల 5వ తేదీన నకిరేకల్ నియోజకవర్గంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఉరుమడ్ల గ్రామం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలగోని నర్సింహ గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అమిత్ అన్న సహకారంతో, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఉరుమడ్ల గ్రామ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర గ్రామాలతో పోలిస్తే ఉరుమడ్లకు అధికంగా అభివృద్ధి నిధులు కేటాయించారని పేర్కొన్నారు.

మంజూరైన నిధులతో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు, వివిధ రకాల పింఛన్లు, CMRF చెక్కుల పంపిణీతో పాటు సీసీ రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రంథాలయ భవనాలు, కుల సంఘాల భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ నెల 5న నకిరేకల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఉరుమడ్ల గ్రామం నుంచి వేలాది మంది తరలివచ్చి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకాలని పోలగోని నర్సింహ గౌడ్ విజ్ఞప్తి చేశారు.