నూజివీడులో రాపర్ల బాలకృష్ణకు మంత్రి పరామర్శ
నూజివీడులో రాపర్ల బాలకృష్ణకు మంత్రి పరామర్శ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి కొలుసు పార్ధసారధి
నూజివీడు: ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు వేంపాడు మేజర్ సాగునీటి పారుదల సంఘం చైర్మన్ రాపర్ల బాలకృష్ణ ప్రమాదవశాత్తు కాలికి గాయమై చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి చిన్న అవుటుపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆసుపత్రికి వెళ్లి బాలకృష్ణను పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి, బాలకృష్ణ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఫోన్ ద్వారా రాపర్ల బాలకృష్ణను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.