BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 30 August 2026, 02:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రేషన్ మాఫియాకు చెక్....

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 02:09 PM
20 వీక్షణలు

రేషన్ మాఫియాకు చెక్.. బియ్యం బస్తాలకు క్యూ ఆర్ కోడ్ ట్యాగ్‌లు

అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇకపై రేషన్ బియ్యం ప్రతి బస్తాకు క్యూ ఆర్ కోడ్ ట్యాగ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా అక్రమంగా పట్టుబడిన రేషన్ బస్తాలు ఏ గోదాము నుంచి వచ్చాయి, ఏ ప్రాంతానికి చెందినవి అనే వివరాలను సులభంగా గుర్తించనున్నారు.

క్యూ ఆర్ కోడ్ విధానాన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు పరిశీలించారు. రేషన్ పంపిణీకి ముందు డీలర్లు తప్పనిసరిగా బియ్యం బస్తాలను స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కానింగ్ ద్వారా బియ్యం సరఫరా, నిల్వ, పంపిణీ వివరాలను అధికారులు పర్యవేక్షించనున్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు అర్హులైన కార్డుదారులకు నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లా నుంచి ఈ విధానాన్ని తొలుత అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.