గుంటూరులో దారుణ హత్య.. పదునైన ఆయుధాలతో దాడి వ్యక్తి హతం
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
గుంటూరు: నగరంలోని కొండా వెంకటప్పయ్య (కేవీపీ) కాలనీలో ఆదివారం దారుణ హత్య చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో పెండ్ర చిన్న (55) అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న నగరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడు తన బాబాయి అంత్యక్రియల కోసం సూర్యాపేట నుంచి గుంటూరుకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.