చాట్రాయిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో డిపిఆర్టియు మండల శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో డిపిఆర్టియు నాయకులు ఆర్. నాగేశ్వరరావు, చంద్రకళ మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థుల్లో భాషపై మక్కువ పెంచేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అదేవిధంగా విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిపిఆర్టియు నాయకులు సత్తెనపల్లి రాము, మండల అధ్యక్షుడు బి.సీహెచ్. రాంబాబు, ప్రధాన కార్యదర్శి తేరా రామారావు, పి. తిరుపతయ్య, ఈఎస్ రంగారావు, సీహెచ్ శ్రీను, బి. రాందాస్, బి. శ్రీను, చంద్రకళ, బి. గణేష్, ఎల్. భార్గవ్, ఏ. క్రాంతి, పి. మహేష్, ఏ. కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.