BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 30 August 2026, 02:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 02:53 PM
29 వీక్షణలు

చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో డిపిఆర్టియు మండల శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.

కార్యక్రమంలో డిపిఆర్టియు నాయకులు ఆర్. నాగేశ్వరరావు, చంద్రకళ మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థుల్లో భాషపై మక్కువ పెంచేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అదేవిధంగా విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిపిఆర్టియు నాయకులు సత్తెనపల్లి రాము, మండల అధ్యక్షుడు బి.సీహెచ్. రాంబాబు, ప్రధాన కార్యదర్శి తేరా రామారావు, పి. తిరుపతయ్య, ఈఎస్ రంగారావు, సీహెచ్ శ్రీను, బి. రాందాస్, బి. శ్రీను, చంద్రకళ, బి. గణేష్, ఎల్. భార్గవ్, ఏ. క్రాంతి, పి. మహేష్, ఏ. కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.