తిరువూరులో బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా వెంపాటి అబ్రాహామ్ మణిరత్నం నియామకం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు: భారతీయ జనతా పార్టీ తిరువూరు మండల అర్బన్ అధ్యక్షుడిగా వెంపాటి అబ్రాహామ్ మణిరత్నం నియమితులయ్యారు. తిరువూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ కార్యవర్గ సమావేశం అనంతరం ఈ నియామకాన్ని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ సూచనలతో నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. తిరువూరు మండల అర్బన్ ఇన్చార్జి అబ్బినేని చంద్రశేఖర్ రావు (బాబు) నూతన అధ్యక్షుడు వెంపాటి అబ్రాహామ్ మణిరత్నానికి నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పోలే శాంతి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కనపర్తి నాగగోపాలకృష్ణ పాల్గొని నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పోలే శాంతి మాట్లాడుతూ పట్టణంలో బీజేపీని అంచెలంచెలుగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం నూతన అధ్యక్షుడు వెంపాటి అబ్రాహామ్ మణిరత్నాన్ని శాలువాలతో సత్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు గంపలగూడెం బీజేపీ మండల అధ్యక్షురాలు వనమా సత్యవాణి, తిరువూరు మండల అధ్యక్షురాలు పగిడిపల్లి విజయలక్ష్మి, తిరువూరు పట్టణ మాజీ అధ్యక్షుడు నాగుబండి ప్రభాకర్ రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కత్తికోల రామచంద్రరావు, మాజీ జిల్లా కోశాధికారి జాలిపర్తి సుజాత, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కొంగర రామారావు, మైనార్టీ మోర్చా జిల్లా కార్యదర్శి షేక్ రాజ్ మహమ్మద్, మహిళా మోర్చా కార్యదర్శి గంధం వెంకటరమణ, ఓబీసీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లపూడి సింహాచలం, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి పొన్నూరు రామ్మోహనరావు, పట్టణ కార్యవర్గ సభ్యురాలు ఇమ్మడి ధనలక్ష్మి, ఓబీసీ మండల ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, బీఎల్ఏ-2లు తదితరులు పాల్గొన్నారు.