BREAKING
అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
Date of Publish : 30 August 2026, 06:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెంలో చెరువులు అడుగంటాయి.. వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 06:08 PM
33 వీక్షణలు

(ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం)

వర్షాభావ పరిస్థితులు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంతానికి సాగునీరు అందకపోవడంతో గంపలగూడెం మండలంలోని చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయి. చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని ఆధారంగా చేసుకుని రైతులు వరి నాట్లు వేయడంతో ప్రస్తుతం చెరువుల్లో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతోంది.

మండలంలోని పలు గ్రామాల్లో చెరువుల కింద ఇప్పటికీ వరి నాట్లు ప్రారంభం కాలేదు. మరికొన్ని గ్రామాల్లో వర్షాలు కురుస్తాయనే ఆశతో చెరువుల్లో నిల్వ ఉన్న నీటితో రైతులు వరి నాట్లు వేశారు. దీంతో చెరువుల్లోని నీరు వేగంగా అడుగంటుతోంది. మరో వారం, పది రోజుల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే మిగిలిన కొద్దిపాటి నీరు కూడా లేకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో రెండు చెరువులు ఉండగా, శివాలయం సమీపంలోని ఒక చెరువు కింద మాత్రమే రైతులు వరి నాట్లు వేశారు. నాట్ల కోసం చెరువు నీటిని వినియోగించడంతో ఆ చెరువు కూడా ఎండిపోయే పరిస్థితికి చేరుకుందని రైతులు తెలిపారు.

వర్షాలు ఆలస్యమైతే ఇప్పటికే వేసిన వరి పంటలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాగునీటి సమస్యపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.