నవంబర్లో ఖాళీ కానున్న 3 ఎమ్మెల్సీ స్థానాలు.. గవర్నర్ కోటాపై కసరత్తు
తెలంగాణ
తెలంగాణ: రాష్ట్రంలో ఈ ఏడాది నవంబర్లో గవర్నర్ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో కొత్తగా ఎవరికి అవకాశం కల్పించాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఖాళీ కానున్న మూడు స్థానాల్లో ఒక స్థానాన్ని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఈరవత్రి అనిల్కు కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముందుగా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుని, అనంతరం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే ఆలోచన ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మిగిలిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను సామాజిక వర్గాల సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం ఆధారంగా భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.