నెమలి వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్న సీఐ గిరిబాబు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి
నెమలి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాల స్వామివారిని ఆదివారం తిరువూరు సీఐ గిరిబాబు, గంపలగూడెం ఎస్ఐ అనిల్, పోలీస్ సిబ్బంది దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు గోపాలాచార్యులు వేద మంత్రాలతో సీఐ గిరిబాబును ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది శ్రీనివాస్, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.