కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి, ఐదుగురికి గాయాలు
తెలంగాణ
/
కరీంనగర్
కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం మధుర నగర్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో తిప్పాయపల్లెకు వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఓ మహిళకు కాలు, చేయి విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.