మధిరలో వాసవి మాతకు గాజుల అలంకరణ
తెలంగాణ
/
ఖమ్మం
సెప్టెంబర్ 4న శ్రావణమాసం నాలుగవ శుక్రవారం ప్రత్యేక పూజలు
మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా వాసవి మాతకు ప్రత్యేక అలంకరణ నిర్వహించనున్నారు.
శ్రావణమాసం నాలుగవ శుక్రవారం సెప్టెంబర్ 4వ తేదీన వాసవి మాతను పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల గాజులతో అత్యంత వైభవంగా అలంకరించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ ప్రత్యేక అలంకరణలో పాల్గొనే మహిళా భక్తులు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల గాజులు మాత్రమే తీసుకురావాలని ఆలయ కమిటీ కోరింది. మహిళా భక్తులు, వాసవి మాత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గాజుల సమర్పణ చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.