BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 30 August 2026, 02:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 02:08 PM
7 వీక్షణలు

మధిరలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ఖమ్మం జిల్లా మధిర పట్టణం: మధిర పట్టణంలోని 17వ డివిజన్ పరిధిలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కౌన్సిలర్ ములకలపల్లి వినయ్, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో మధిర నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అది మూలం పుల్లారావు, మల్లెల బాబు, నాయుడు, నాగేంద్రమ్మ, రాజ్యలక్ష్మి, సులోచన, రామకృష్ణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.