మధిరలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మధిరలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ఖమ్మం జిల్లా మధిర పట్టణం: మధిర పట్టణంలోని 17వ డివిజన్ పరిధిలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కౌన్సిలర్ ములకలపల్లి వినయ్, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో మధిర నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అది మూలం పుల్లారావు, మల్లెల బాబు, నాయుడు, నాగేంద్రమ్మ, రాజ్యలక్ష్మి, సులోచన, రామకృష్ణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.