కోదుమూరులో అంతర్గత సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన
తెలంగాణ
/
ఖమ్మం
చింతకాని: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం కోదుమూరు గ్రామంలో ఆదివారం పర్యటించిన ఆయన ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరచి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.