BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 30 August 2026, 02:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వేపలసింగారంలో ఆసక్తికర ఘటన....

తెలంగాణ
/ సూర్యాపేట
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 02:09 PM
15 వీక్షణలు

వేపలసింగారంలో ఆసక్తికర ఘటన.. ఆన్‌లైన్‌లో కూతురి పెళ్లి చూసి అక్షింతలు చల్లిన తల్లిదండ్రులు

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతులు తమ ఏకైక కుమార్తె హిమబిందు వివాహాన్ని ఆన్‌లైన్ ద్వారా వీక్షించి అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హిమబిందుకు ఎన్టీఆర్ జిల్లా చెందిన రోహిత్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం రాత్రి అమెరికాలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

విదేశాల్లో జరిగిన పెళ్లి వేడుకకు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయిన తల్లిదండ్రులు ఆన్‌లైన్ ద్వారా వివాహాన్ని వీక్షించారు. కుమార్తెకు ఆశీస్సులు అందిస్తూ అక్షింతలు చల్లారు. అనంతరం వేపలసింగారం గ్రామంలో బంధువులు, స్నేహితులు, గ్రామస్థులకు పెళ్లి విందు ఏర్పాటు చేశారు.

దూర దేశంలో పెళ్లి జరిగినా.. తల్లిదండ్రుల ఆశీర్వాదం మాత్రం ఆన్‌లైన్ వేదికగా కుమార్తెకు చేరింది. ఈ ఘటన గ్రామస్థులను ఆకట్టుకుంది.