BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

పానుగంటి చైతన్య రౌడీ షీటర్ కాదు.. ఉద్యమ యోధుడు: వైఎస్ఆర్సిపి విద్యార్థి నేత వినోద్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:01 PM
64 వీక్షణలు

అమరావతి రాజధాని ప్రాంత రైతులే ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మడం లేదని వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్ ఆరోపించారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్‌లో ఉన్న జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

చంద్రబాబు మోసాలను గుర్తించిన రాజధాని రైతులు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ గుండాలు దాడులకు పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు.

పానుగంటి చైతన్యపై ఎక్కడ రౌడీ షీట్ ఉందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగా పానుగంటి చైతన్యపై దుష్ప్రచారం చేస్తోందని, ఆయన రౌడీ షీటర్ కాదని, ఉద్యమ యోధుడని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించిన వినోద్.. ప్రజల తీర్పుతో 2029లో తప్పకుండా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం నేతలు భాను ప్రకాష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.