BREAKING
నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం
www.ntodaynews.com

పానుగంటి చైతన్య రౌడీ షీటర్ కాదు.. ఉద్యమ యోధుడు: వైఎస్ఆర్సిపి విద్యార్థి నేత వినోద్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:01 PM
14 వీక్షణలు

అమరావతి రాజధాని ప్రాంత రైతులే ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మడం లేదని వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్ ఆరోపించారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్‌లో ఉన్న జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

చంద్రబాబు మోసాలను గుర్తించిన రాజధాని రైతులు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ గుండాలు దాడులకు పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు.

పానుగంటి చైతన్యపై ఎక్కడ రౌడీ షీట్ ఉందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగా పానుగంటి చైతన్యపై దుష్ప్రచారం చేస్తోందని, ఆయన రౌడీ షీటర్ కాదని, ఉద్యమ యోధుడని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించిన వినోద్.. ప్రజల తీర్పుతో 2029లో తప్పకుండా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం నేతలు భాను ప్రకాష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.