BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

పిఠాపురం వర్మకు చంద్రబాబు పిలుపు.. అమరావతిలో కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:32 AM
104 వీక్షణలు

అమరావతి: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు రావడంతో ఆయన అమరావతికి వెళ్లారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి వర్మ ముఖ్యమంత్రిని కలిశారు.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల ఎంపిక అంశంపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. ఇటీవల ఖరారైన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో వర్మను చంద్రబాబు పిలిపించి మాట్లాడినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే పదవుల విషయంలో పార్టీ అధినేత నిర్ణయమే తనకు ముఖ్యమని వర్మ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సూచనలు, ఆదేశాలను గౌరవిస్తానంటూ వర్మ సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు.

పిఠాపురం రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న వర్మకు భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే అంశంపై టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.