BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

Health: కుప్పంలో పల్స్ పోలియో కార్యక్రమానికి ఘన శ్రీకారం.. చిన్నారులకు పోలియో చుక్కలు

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
28 Jun, 2026 - 09:03 AM
25 వీక్షణలు

కుప్పం | జూన్ 28 | NTODAY NEWS

కుప్పం నియోజకవర్గంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డిప్యూటీ డీఎంహెచ్‌ఓ) డాక్టర్ గంగాదేవి ఘనంగా ప్రారంభించారు. బస్సు స్టాండ్ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, పోలియో నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్ సుభాష్ రాజా, డాక్టర్ దీప్ కుమార్, డాక్టర్ సాయ్ ప్రదాప్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు అందించారు. ప్రతి చిన్నారికి నిర్ణీత వయస్సులో పోలియో టీకా అందించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని వారు తెలిపారు.

కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, కుప్పం మున్సిపల్ కమిషనర్, కూటమి నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

పిల్లల ఆరోగ్య పరిరక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని పేర్కొన్న అధికారులు, తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు.