పోలవరం ఎంపీపీ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పోలవరం ఎంపీపీ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరం కె.పి మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు పింగుల రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ ప్రముఖులు మరిడి చిట్టిబాబు, ఎర్రా ప్రసాదరావు, ఎర్రా రమేష్, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు జయరాజు తదితరులతో పాటు సుమారు 50 మంది ప్రముఖులు హాజరయ్యారు.
మరిడి చిట్టిబాబు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వేచ్ఛా ఫలాలను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
స్వాతంత్ర్య భారతదేశం గొప్పతనం గురించి విద్యార్థులు తెలుగు, ఆంగ్ల భాషల్లో చేసిన ప్రసంగాలను అభినందించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు 150కి పైగా బహుమతులు, మిఠాయిలు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఆర్. నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పరస శ్రీనివాసరావు, కారుమంచి దేవి, జక్కం రాజేష్, మలమంటి సిరి చేసిన కృషిని అభినందించారు.