BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

పోలవరం ఎంపీపీ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 07:59 PM
63 వీక్షణలు

పోలవరం ఎంపీపీ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరం కె.పి మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు పింగుల రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ ప్రముఖులు మరిడి చిట్టిబాబు, ఎర్రా ప్రసాదరావు, ఎర్రా రమేష్, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు జయరాజు తదితరులతో పాటు సుమారు 50 మంది ప్రముఖులు హాజరయ్యారు.

మరిడి చిట్టిబాబు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వేచ్ఛా ఫలాలను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.

స్వాతంత్ర్య భారతదేశం గొప్పతనం గురించి విద్యార్థులు తెలుగు, ఆంగ్ల భాషల్లో చేసిన ప్రసంగాలను అభినందించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు 150కి పైగా బహుమతులు, మిఠాయిలు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఆర్. నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పరస శ్రీనివాసరావు, కారుమంచి దేవి, జక్కం రాజేష్, మలమంటి సిరి చేసిన కృషిని అభినందించారు.